ఇంద్రానగర్‌లో ప్రణీత్ ప్రాజెక్ట్ | praneeth project in indra nagar | Sakshi
Sakshi News home page

ఇంద్రానగర్‌లో ప్రణీత్ ప్రాజెక్ట్

May 17 2014 2:27 AM | Updated on Sep 2 2017 7:26 AM

ఇంద్రానగర్‌లో ప్రణీత్ ప్రాజెక్ట్

ఇంద్రానగర్‌లో ప్రణీత్ ప్రాజెక్ట్

రోజురోజుకూ హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు ఆదరణ పెరుగుతోందని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ చెప్పారు.

సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు ఆదరణ పెరుగుతోందని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ చెప్పారు. ఇటీవల ప్రణీత్ ప్రణవ్ ఆంటిలియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రాజెక్ట్ వివరాలను ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.

ఇంకా ఏమన్నారంటే..
 బాచుపల్లి సమీపంలోని ఇంద్రానగర్‌లో 50 ఎకరాల్లో ప్రణీత్ ప్రణవ్ ఆంటిలియా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. మొత్తం 600లకు పైగానే విల్లాలొస్తాయి. వీటి విస్తీర్ణాలు 120 గజాల నుంచి 300 గజాల మధ్య ఉంటాయి. రూ.60 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య వీటి ధరలున్నాయి. ఈనెల చివరి వరకు  విల్లాను కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు హోమ్ ఆటోమేషన్‌ను ఉచితంగా ఇవ్వడంతో పాటు చ.అ. కు రూ.300 డిస్కౌంట్ ను అందుకోవచ్చు.

 35 వేల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ నిర్మిస్తుండమే కాకుండా మొత్తం విస్తీర్ణంలో 45 శాతం ఓపెన్ ప్లేస్‌కు, 13 శాతం పచ్చదనానికి కేటాయించాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్‌ను ఆనుకొనే మరో 10 ఎకరాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌ను కూడా చేపడతాం.

 గోపన్‌పల్లిలో ఆరున్నర ఎకరాల్లో ప్రణవ్ ప్రైడ్‌ను నిర్మించనున్నాం. మొత్తం 60 విల్లాలు. ధరను రూ.1.8 కోట్ల నుంచి రూ.3 కోట్లుగా నిర్ణయించాం. బీరంగూడలో 35 ఎకరాల్లో ప్రణవ్ పనోరమా ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించనున్నాం. మొత్తం 400 విల్లాలు. ధర రూ.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఆదిభట్ల, వెలిమల, కొల్లూరుల్లో కూడా లగ్జరీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement