♦ ఆయన రాకతో శుభారంభం
♦ సీఎల్ఎస్ఏ వ్యాఖ్యలు
♦ సీఈవో ఎంపిక ప్రక్రియ జోరు...
♦ వ్యూహాల పునఃసమీక్ష సానుకూలాంశాలు
న్యూఢిల్లీ: వివాదాల నుంచి బైటపడే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్గా రావడం కంపెనీకి ఊతమివ్వగలదని బ్రోకింగ్ కన్సల్టెన్సీ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. ఇది సంస్థకు శుభారంభం ఇవ్వగలదని పేర్కొంది. సుస్థిరమైన నాయకత్వం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవడం, కంపెనీ సంస్కృతిపరమైన వివాదాల పరిష్కారం మొదలైన అంశాల దిశగా ఇన్ఫీ తలపెట్టే చర్యలకు సంబంధించి గత ఆరేళ్లలో కంపెనీకి లభించిన అత్యుత్తమ శుభారంభం ఇదే కాగలదని సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది.
వ్యవస్థాపకులు, బోర్డు మధ్య విభేదాల నేపథ్యంలో సీఈవో విశాల్ సిక్కా వైదొలగడం, పరిస్థితులు చక్కదిద్దేందుకు నందన్ నీలేకని పునరాగమనం తదితర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్.. ఇప్పటికే సీఈవో ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారని, వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాలను పునఃసమీక్షించడం మొదలుపెట్టడం తదితర అంశాలు సానుకూల ధోరణిలో ఇన్వెస్టర్లను ఆశ్చర్యపర్చాయని సీఎల్ఎస్ఏ తెలిపింది. ‘ఇన్ఫీ వ్యూహాల దిశ మారనుండటం, మెరుగైన నాయకత్వం, తక్కువ వేల్యుయేషన్ తదితర అంశాల కారణంగా రిస్కులతో పోలిస్తే రివార్డులు గణనీయంగా మెరుగుపడగలవు’ అని పేర్కొంది.
మరోవైపు, ఇన్ఫోసిస్కు దార్శనికత గల సీఈవో అవసరమని పరిశ్రమ నిపుణుడు గణేష్ నటరాజన్ తెలిపారు. సదరు సీఈవోకి టెక్నాలజీ నైపుణ్యం ఒక్కటే ఉంటే సరిపోదని.. ఇటు బోర్డును.. అటు ఒత్తిడి చేసే వర్గాలను సైతం మెప్పిస్తూ, కంపెనీని ముందుకు తీసుకెళ్లే సత్తా కూడా ఉండాలని ఆయన చెప్పారు.
బైబ్యాక్లో ప్రమోటర్లు కూడా..
ఇన్ఫోసిస్ ప్రతిపాదిత బైబ్యాక్ ఆఫర్లో తమ షేర్లను కూడా విక్రయించాలని కంపెనీ ప్రమోటర్లు భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు ప్రమోటర్లు తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే, ఆయా ప్రమోటర్ల పేర్లు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితర సహ వ్యవస్థాపకులకు ప్రస్తుతం ఇన్ఫోసిస్లో 12.75 శాతం వాటాలు ఉన్నాయి. వ్యవస్థాపకుల నుంచి వేధింపుల కారణంతో సీఈవో హోదా నుంచి సిక్కా వైదొలిగిన మరుసటి రోజే ఇన్ఫోసిస్ బోర్డు సుమారు రూ. 13,000 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్ ఆఫర్కి ఆమోదముద్ర వేసింది. షేరు ఒక్కింటికి రూ. 1,150 చొప్పున మొత్తం రూ. 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ ప్రతిపాదనకు ప్రత్యేక తీర్మానం ద్వారా షేర్హోల్డర్లు ఇంకా ఆమోదం తెలపాల్సి ఉన్నట్లు కంపెనీ వివరించింది.
ఇన్ఫీకి నీలేకని జోష్..!
Published Tue, Aug 29 2017 12:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement