హైదరాబాద్‌లో ఇంటెల్‌ అభివృద్ధి కేంద్రం

Intel Tech Development Center In Hyderabad With In A Week - Sakshi

వారంలో ప్రారంభం; తొలి దశలో వంద మందికి ఉద్యోగాలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మాదాపూర్‌లోని సాలార్పూరియా సత్త్వా నాలెడ్జ్‌ సిటీలో సాంకేతికత అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. 5–6 అంతస్తుల్లో, సుమారు 3 లక్షల చ.అ.ల్లో ఉండే ఈ కేంద్రాన్ని వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ కేంద్రం సీటింగ్‌ కెపాసిటీ 1,500 కాగా.. తొలి దశలో సుమారు వంద మంది ఇంజనీర్లను ఎంపిక చేసుకోనున్నారు. ఈ కేంద్రంలో ఎస్‌ఓసీ (సిస్టమ్‌ ఆన్‌ చిప్‌) సాంకేతికత మీద పని చేస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top