భారత్‌కు తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది 

India First 5G Smartphone To Be Launched - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఐకూ భారత్‌కు ఫిబ్రవరిలో ఎంట్రీ ఇస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయనుంది. భారత్‌లో ఇదే తొలి 5జీ మోడల్‌ కానుంది. 5జీతోపాటు 4జీ మోడళ్లనూ ప్రవేశపెట్టనున్నట్టు ఐకూ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ గగన్‌ అరోరా తెలిపారు. 2020లో దేశీయంగా 10 లక్షల యూనిట్లను విక్రయించాలన్న లక్ష్యంతో కంపెనీ దూసుకొస్తోంది. తొలుత ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకోనున్న ఈ బ్రాండ్, రానున్న రోజుల్లో ఆఫ్‌లైన్‌లోనూ స్మార్ట్‌ఫోన్లను విక్రయించనుంది. చైనాలో వివో సబ్‌ బ్రాండ్‌గా కార్యకలాపాలు సాగించిన ఐకూ.. ప్రస్తుతం సొంత బ్రాండ్‌లో మార్కెట్‌ చేస్తోంది. భారత్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరించనుంది. బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top