
రూ. 2,700 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంకు
ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,700 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,700 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. అంతర్గత క్యాపిటల్ అడెక్వసీ మదింపు ప్రక్రియ (ఐక్యాప్) ఆధారంగా వేసిన అంచనాలను బోర్డు సమీక్షించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదనపు మూలధన అవసరాల కోసం మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ, టైర్ 1, టైర్ టూ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించనున్నట్లు ఆంధ్రాబ్యాంకు వివరించింది.