ఆధార్‌లో కొత్త ఫీచర్‌ | Aadhaar face authentication: UIDAI adds new safety feature from July 1 | Sakshi
Sakshi News home page

ఆధార్‌లో కొత్త ఫీచర్‌

Jan 15 2018 2:36 PM | Updated on Jan 15 2018 3:54 PM

Aadhaar face authentication: UIDAI adds new safety feature from July 1 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)  కొత్త ఫీచర్‌ను ప్రకటించింది.   ఆధార్ వినియోగదారులకు  ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌ను జోడిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది.  ఈ కొత్త పద్ధతి  జూలై 1, 2018  నుంచి ప్రారంభమవుతుందని  తెలిపింది. ఈ మేరకు యుఐడిఎఐ ఒక  సర్క్యులర్‌ జారీ చేసింది.


ఆధార్‌ ధృవీకరణకు మరో కొత్త  ప్రముఖమైన  టెక్నాలజీని జోడిస్తున్నామని   యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే  సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఫ్రింగర్‌ ప్రింట్‌  తో ఇబ‍్బందులుపడుతున్న వృద్ధులు  తదితరులకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన ట్విటర్‌లో  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement