
టైరోన్ లి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపనీస్ డిజైనర్ లైఫ్స్టైల్ బ్రాండ్ మినిసో భారత్లో 100 స్టోర్ల మార్కును దాటింది. రెండేళ్ల క్రితం భారత్కు ప్రవేశించిన మినిసో.. ప్రస్తుతం 43 నగరాల్లో 106 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. పోటీ ధరలో ఉత్పత్తుల తయారీకి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటామని కంపెనీ ఇండియా జీఎం టైరోన్ లి వెల్లడించారు. దేశీయంగా విక్రయంతోపాటు అంతర్జాతీయ మార్కెట్కు వీటిని ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.