హైదరాబాద్లో ప్రణాళిక.. విజయవాడలో అమలు | will plan in hyderabad, implement in vijayawada, says kishore babu | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ప్రణాళిక.. విజయవాడలో అమలు

Aug 13 2014 5:34 PM | Updated on Sep 2 2017 11:50 AM

హైదరాబాద్లో ప్రణాళిక.. విజయవాడలో అమలు

హైదరాబాద్లో ప్రణాళిక.. విజయవాడలో అమలు

హైదరాబాద్‌లో ప్రణాళికలు వేసుకుని విజయవాడలో అమలు చేస్తామని మంత్రి రావెల కిశోర్ బాబు చెప్పారు.

ఎవరో కొంతమందికి లబ్ధి చేకూర్చాలని విజయవాడను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా ఎన్నుకోలేదని రాష్ట్ర మంత్రి రావెల కిశోర్బాబు అన్నారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎంపికచేస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన స్పందించారు.

రాజధాని ఏర్పాటు చేయాలంటే కొన్ని ప్రమాణాలు అవసరమని, ఆ ప్రమాణాలు అమలు చేయాలంటే ఓ తాత్కాలిక రాజధాని అవసరమని, అందుకోసమే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎన్నుకున్నామని కిశోర్బాబు వివరించారు. హైదరాబాద్‌లో ప్రణాళికలు వేసుకుని విజయవాడలో అమలు చేస్తామని, రాజధాని వికేంద్రీకరించి ఉండాలి కనుకే విజయవాడను ఎన్నుకున్నామని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement