విశాఖపట్నం: చాలా ప్రత్యామ్నాయ మార్గాలు వదిలేసి విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏమిటంటూ వినియోగదారులు సంధించిన ప్రశ్నకు ఈపీడీసీఎల్లో అంతర్మథనం మొదలైంది. ఇటీవల వినియోగదారుల నుంచి వ్యతిరేకతను చూశాక ప్రతిపాదించిన మేరకు చార్జీలు పెరుగుతాయో లేదోననే అనుమానం పుట్టుకొచ్చింది. గతేడాది కూడా ఇదే విధంగా టారిఫ్లు ఇచ్చినా చార్జీలు పెంచకుండా పాత టారిఫ్నే కొనసాగిస్తూ ఏపీఈఆర్సీ నిర్ణయం ప్రకటించింది.
ఈసారి కూడా అదే పునరావృతమైనా లేక ప్రతిపాదించిన స్థాయిలో చార్జీలు పెరగకపోయినా ఈపీడీసీఎల్ ఆర్థిక లోటు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ సీఎండీ ఆర్ ముత్యాలరాజు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. వాటిపైనే రోజూ కార్పొరేట్ కార్యాలయంలో డెరైక్టర్లు, సీజీఎంలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో 52.18 లక్షల విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి విద్యుత్ సరఫరా అందించేందుకు 941 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 150181 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ,33/11కెవి సబ్స్టేషన్లు 653 ఉన్నాయి. ఇవి తరచుగా మరమ్మతులకు గురవుతుండటం వల్ల విద్యుత్ అమ్మకాలపై ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫెయిల్యూర్ శాతం 4.89 నమోదయింది. ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా జతకలిసే సరికి ఈ శాతం మరింత పెరుగుతుంది. ఇప్పటికే నర్శీపట్నంలో రూ.3.31 కోట్లతో ఈ పనులు పూర్తి చేసింది. 15శాతం పైబడి నష్టాలు కలిగిన 9పట్టణాల్లో ఈ పనులకు రూ.61.82 కోట్లు మంజూరు చేశారు. పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. అదే విధంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూ.61.44 కోట్లతో ఈపీడీసీఎల్ పరిధిలోని 29 పట్టణాల్లో చేపట్టిన ఫీడర్ వారీగా ఎనర్జీ ఆడిట్ నివేదికలు సేకరించడం, కేంద్రీకృత వినియోగదారుల సేవాకేంద్రాల ఏర్పాటు పనులు 28 పట్టణాల్లో పూర్తికాగా విశాఖలో మార్చి 8వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
సబ్స్టేషన్లపై భారం పడకుండా చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకునే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఫరఫరా కోసం రూ.25.25 కోట్ల ఖర్చుతో 430 కిలో మీటర్ల 33కెవి లైన్లు ఇంటర్ లింకింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. విద్యుత్ను పొదుపు చేయాలని కూడా ఈపీడీసీఎల్ ప్రయత్నిస్తోంది. దాని కోసం 5స్టార్ రేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే వినియోగించనున్నారు. ప్రస్తుతం అమ్మకాల ద్వారా వస్తున్న రూ.7898.223 కోట్ల ఆదాయాన్ని ఇలాంటి విధానాల ద్వారా పెంచుకోవాలని ఈపీడీసీఎల్ భావిస్తోంది.
ఏం చేద్దాం..
Published Sat, Feb 28 2015 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement