శ్రీకాకుళం :ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలల బోధనపై ప్రధాన ప్రభావం చూపింది. వేసవి సెలవుల్లో బదిలీలు చేపడతామని చెప్పిన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ఆగస్టులో ప్రక్రియ చేపట్టింది. ఆన్లైన్ విధానం ద్వారానా, వెబ్ కౌన్సెలింగ్ విధానం ద్వారానా అనే విషయంపై తర్జన భర్జన పడింది. చివరికి సెప్టెంబర్ 30న వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టేందుకు ఉత్తర్వులు వెలువరించింది. ఇందులోనూ గందరగోళాన్ని సృష్టిస్తూ రెండు నెలలపాటు తాత్సారం చేసింది. నవంబర్ చివరి వారంలో ప్రక్రియను చేపట్టింది.
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పోస్టులను సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంలో కూడా తర్జన భర్జన పడి చివరికి ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే రేషనలైజేషన్ చేపట్టింది. జనవరిలో పని సర్దుబాటు పేరిట రేషనలైజేషన్ చేపట్టి వివాదానికి తెరలేపింది. ప్రభుత్వం సెప్టెంబర్లో జీఓ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో 75 మంది పిల్లలుంటే ఆ పాఠశాలను పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియంగా మార్చేయాలని ఆదేశించింది. అక్కడ ఉన్న తెలుగు మీడియం పిల్లలను సమీపంలోని పాఠశాలలకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కూడా వివాదమై ఆందోళన చేపట్టే దిశగా పయనించింది. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాలి. ఆగస్టు వరకు పాఠ్య పుస్తకాలు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇందులో పదవతరగతికి చెందినవి కూడా ఉన్నాయి. ఇది కూడా బోధనకు అవాంతరాలు ఏర్పడేలా చేసింది.
సెప్టెంబర్ చివరి వారం నుంచి పదవతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఈ ఏడాది జనవరి రెండో వారం వరకు అటువంటి దాఖలాలే లేవు. ఇప్పుడిప్పుడే సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి సత్ఫలితాలనిస్తే తప్ప ఉత్తీర్ణతా శాతం మెరుగుపడే అవకాశం ఉండదు.
-జిల్లాలో 470 ప్రభుత్వ పాఠశాలలు, 32 కేజీబీవీలతోపాటు సాంఘిక, గిరిజన సంక్షేమ, నవోదయ, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. 50 ప్రైవేటు పాఠశాలలున్నాయి. మొత్తంగా 37,741 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరిగా లేకపోవడంతో ఆ ప్రభావం ఉత్తీర్ణతా శాతంపై పడేలా వుంది.
ప్రత్యేక దృష్టి సారించాం
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు ఇస్తున్నా. బదిలీలు, కౌన్సిలింగ్ సందర్భాల్లో ఉపాధ్యాయులను పాఠశాల నుంచి వేరొక దగ్గరికి రప్పించలేదు. అందువల్ల బోధనకు ఆటంకం కలగలేదు. వెబ్ విధానం వలన ఉపాధ్యాయులకే నేరుగా సమాచారం అందింది. దీని వల్ల ఒక గంట కూడా ఉపాధ్యాయులు పాఠశాలకు దూరంగా లేరు. దేవానందరెడ్డి, డీఈవో
‘టెన్’షన్
Published Thu, Jan 28 2016 11:34 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)
Team India Head Coach: బీసీసీఐ ఆఫర్ నిజమే.. కానీ!
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
మహారాష్ట్ర: కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..
జీవితకాల గరిష్ఠాలకు స్టాక్మార్కెట్లు.. 22,950 మార్కు చేరిన నిఫ్టీ
బెంగుళూరులోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపు
లోకేష్ కి ఆ వీడియో ఎక్కడిది
తప్పక చదవండి
- మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
- 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
- Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
- ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
Advertisement