నెల్లూరు (సెంట్రల్): చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటానని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు విస్మరిం చారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు...
నెల్లూరు (సెంట్రల్): చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటానని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు విస్మరిం చారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు పూటకో మా ట చెబుతూ కాలం గడుపుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో దయ్యబట్టారు.
ఎన్నికల మెనిఫేస్టోలో చేనేత కార్మికులకు బ్యాంకు రుణాల మాఫీ, పవర్ లూమ్లపై రుణాలు రద్దు, చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు, చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహా యింపు, ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష వరకు సంస్థాగత రుణం కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో ఒక చేనేత పార్కును ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ కల్పిస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
మూతపడిన చేనేత సంఘాల పునరుద్ధరణ, బకాయిల రద్దు, మూల ధనం సహాయం అందించడంతోపాటు 50 శా తం సబ్సిడీతో మగ్గాలను సరఫరా చేస్తామ న్నారు. చేనేత సొసైటీలకు 20 శాతం రాయితీపై ముడి సరుకులు సరఫరా, మగ్గాలకు ఉచిత విద్యుత్ను అందిస్తామని ఇప్పుడు మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. సహకార సంఘాలు లేనిచోట స్వయం సహాయక సంఘాలు ఏర్పా టు చేసి వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందే లా చూస్తామని చెప్పి వాటి గురించి ఎక్కడా మాట్లాడక పోవడం చేనేత కార్మికులను మోసం చేయడమే అని విమర్శించారు.
చేనేత కార్మికుల పిల్లలను చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీ, ఉచిత వైద్యం కల్పిస్తామని చెప్పి ఆ ఊసే ఎత్త డం లేదన్నారు. చేనేత పరిశ్రమ ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం, వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేతలకు బడ్జెట్లో వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధిని ప్రవేశపెడతామని చెప్పారని, ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆ ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు.