ఓటరు నమోదు గడువును మరోమారు పొడిగించారు. మంగళవారంతో గడువు ముగియగా మరో ఆరు రోజులపాటు నమోదు గడువును పెంచుతున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటరు నమోదు గడువును మరోమారు పొడిగించారు. మంగళవారంతో గడువు ముగియగా మరో ఆరు రోజులపాటు నమోదు గడువును పెంచుతున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పేరు నమోదు చేసుకోవడంతోపాటు అభ్యంతరాలు దాఖలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈఆర్ఓ లేదా బీఎల్ఓను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.