'గత్యంతరం లేకనే తెలంగాణ బిల్లు పెట్టింది' | venkaiah naidu takes on congress party | Sakshi
Sakshi News home page

'గత్యంతరం లేకనే తెలంగాణ బిల్లు పెట్టింది'

Mar 4 2014 2:10 PM | Updated on Mar 18 2019 9:02 PM

నరేంద్ర మోడీ భయంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: నరేంద్ర మోడీ భయంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు మోడీ భయం పట్టుకుని వేరే గత్యంతరం లేక బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ఓటు కోసం, సీటు కోసం కాకుండా ఇచ్చిన మాట కోసం బీజేపీ మద్దతిచ్చిందన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. పిచ్చి తుగ్లక్ దశవతారంలా కాంగ్రెస్ అవతారముందన్నారు. అక్కడా ఇక్కడా ఒకే మాట చెప్పిన బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు.  సీమాంధ్ర రాజధానిపై కనీస శ్రద్ధ పెట్టలేదని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement