ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 99వ జయంతి వేడుకలను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంచిర్యాలలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు
సాక్షి, మంచిర్యాల : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 99వ జయంతి వేడుకలను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంచిర్యాలలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు తెలిపారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ జాతిపిత, స్వా తంత్య్ర సమరయోధుడు, సామాజిక స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరిచిపోలేనివని.. ఆయన మన జిల్లాకు చెందిన వారు కావడం జిల్లాప్రజల అదృష్టమన్నారు. ఇలాంటి మహనీయ వ్యక్తి జయంతి వేడుకలు మంచి ర్యాలలో జరుపుకోవడం సంతోషకరమన్నా రు. ఈ వేడుకలను పలు ఎంపీలు, ఎమ్యెల్యేలు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రులు, వివిధ సం ఘాలు, పార్టీల నేత లను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రజలూ అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నిర్వాహక సభ్యులు రామ్రాజ్, లక్ష్మణ్సేవా సదన్ ప్రధాన కార్యదర్శి బాలాజీ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గాదె సత్యం, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముకేశ్గౌడ్, నాయకులు కోసరి రవీంద్రనాధ్, చంద్రశేఖర్ ఉన్నారు.