కడప శివారులో లారీ,మినీ వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి | Three people killed in road accident at Kadapa | Sakshi
Sakshi News home page

కడప శివారులో లారీ,మినీ వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి

Oct 20 2013 9:18 AM | Updated on Sep 1 2017 11:49 PM

కడప శివారు ప్రాంతమైన కనుమలోపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కడప శివారు ప్రాంతమైన కనుమలోపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.అతివేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మినీ వ్యానును ఢీ కొట్టింది.ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఆ ఘటనలో మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి 108తోపాటు పోలీసులకు సమాచారం అందించారు.

 

దాంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అలాగే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.అనంతరం మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతులంతా కర్నూలు జిల్లా డోన్ వాసులని పోలీసులు తెలిపారు.లారీ డ్రైవర్ అతివేగమే ఆ దుర్ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement