లోయలో పడిన మహిళ | The valley of the fallen woman | Sakshi
Sakshi News home page

లోయలో పడిన మహిళ

May 14 2014 12:28 AM | Updated on Oct 20 2018 6:17 PM

లోయలో పడిన మహిళ - Sakshi

లోయలో పడిన మహిళ

తిరుమల అవ్వాచ్చారి కోన లోయలో మంగళవారం ఓ మహిళ ప్రమాదవశాత్తు పడింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు వెంకటలక్ష్మి(45) ఒంటరిగా కాలిబాటలో తిరుమలకు బయలుదేరారు

తిరుమల: తిరుమల అవ్వాచ్చారి కోన లోయలో మంగళవారం ఓ మహిళ ప్రమాదవశాత్తు పడింది.   శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు వెంకటలక్ష్మి(45) ఒంటరిగా కాలిబాటలో తిరుమలకు బయలుదేరారు.సాయంత్రం నాలుగు గంటలకు నృసింహస్వామి ఆలయానికి సమీపంలోని అవ్వాచ్చారి కోన లోయలో సుమారు 20అడుగుల లోతులో ఆమె పడి పోయారు. సమాచారం తెలియగానే విజిలెన్స్ ఏవీఎస్‌వో సాయిగిరిధర్ ఫైర్ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి వెళ్లారు. గాయాలపాలైన ఆమెను స్ట్రెచర్‌పై తాళ్లసాయంతో పైకి తీసుకొచ్చి తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. కాగా, తన వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement