కానూరులో అంతర్ జిల్లా దొంగ అరెస్టు | The inter-district robber arrested in Kaanuru | Sakshi
Sakshi News home page

కానూరులో అంతర్ జిల్లా దొంగ అరెస్టు

Oct 2 2013 1:03 AM | Updated on Aug 24 2018 2:33 PM

పెనమలూరు, న్యూస్‌లైన్ : పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను పెనమలూరు పోలీసులు మంగళవారం కానూరులో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.7లక్షల విలువైన వస్తువులను స్వాధీనపర్చుకున్నారు.

పెనమలూరు, న్యూస్‌లైన్ :  పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను పెనమలూరు పోలీసులు మంగళవారం కానూరులో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.7లక్షల విలువైన వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. కానూరులోని ఏసీపీ తూర్పు డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీపీ ఎం.రవిప్రకాష్  వివరాలు వెల్లడించారు. గుంటూరు ఆనంద్‌పేటకు చెందిన షేక్ అమీర్‌బాషా అలియాస్ షేక్ జమీర్‌బాషా.. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తన సహచరులతో కలిసి అనేక దొంగతనాలు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.  విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, ఏలూరు, గుడివాడలో 20 పైగా చోరీలకు పాల్పడ్డాడు. ఏడు బైకులు, తొమ్మిది బంగారు గొలుసులు అపహరించాడు. పలు ఇళ్లల్లో చొరబడి విలువైన వస్తువులు, నగదు దోచుకున్నాడు. ప్రస్తుతం కానూరులోని సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.  
 
 గుంటూరులో ఉన్నప్పటినుంచే నేరాలు
 బాషా గతంలో గుంటూరులో పూలవ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటు పడడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అతడి స్నేహితులు పఠాన్‌బుడే, అమీర్‌బేగ్, జోహార్, జావేద్‌ఖాన్, ముస్తాఫాఖాన్, అబ్దుల్లాతో కలిసి గుంటూరు, లాలాపేట, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో  నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించారు. జైలు నుంచి 2010లో బయటకు వచ్చిన అమీర్‌బాషా వివాహం చేసుకుని  కానూరుకు మకాం మార్చాడు.  జైల్లో  పరిచయమైన పాతనేరస్తులు గంజి చిన్నా, తిరుపతయ్యతో కలిసి మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.
 
 గంజి చిన్నా,  మరో పాతనేరస్తుడు ముస్తాఫాఖాన్‌లను మూడు నెలల క్రితం పటమట పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం జావేద్‌ఖాన్, నయీమ్‌లను పెనమలూరు పోలీసులు అరెస్టుచేశారు. తిరుపతయ్యను తెనాలి పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అమీర్‌బాషా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు సనత్‌నగర్‌లో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నాలుగు బైక్‌లు, 104 గ్రాముల బంగారు అభరణాలు,17 వేల నగదు, రెండు ఎల్‌సీడీలు, ఒక డీవీడీ ప్లేయర్, వెండినగలతోపాటు రాజమండ్రి గౌరీపట్నం వద్ద కొన్న ఇంటి స్థలం దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. బాషా మారు పేరుతో రాజమండ్రిలో ఆధార్ కార్డు కూడా పొందాడని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement