నీటి గుంతలో పడి బాలుడు మృతి | The boy Died who fell into the water | Sakshi
Sakshi News home page

నీటి గుంతలో పడి బాలుడు మృతి

Nov 15 2015 3:46 PM | Updated on Sep 3 2017 12:32 PM

ఆడుకుంటూ నీటి గుంతలో పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఆడుకుంటూ నీటి గుంతలో పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన వైఎస్సార్‌జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే మేదరి రాజు (10) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించలేదు. కాగా, ఆదివారం మధ్యాహ్నం అదే ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది తీసిన గుంతలో రాజు మృతదేహాన్ని గుర్తించారు. వర్షానికి ఆ గుంతలో నీరు చేరి ఉండడంతో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందినట్టు తెలుస్తోంది. రాజు చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో పెద్దనాన్న వద్ద ఆశ్రయం పొందుతున్నాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement