జనంపైకి దూసుకెళ్లిన లారీ: టీడీపీ నేత మృతి | TDP Leader Raju killed in lorry accident | Sakshi
Sakshi News home page

జనంపైకి దూసుకెళ్లిన లారీ: టీడీపీ నేత మృతి

May 12 2015 8:39 AM | Updated on Aug 10 2018 9:42 PM

తూర్పు గోదావరి జిల్లా టి. అన్నవరం మండలం గంటిపెద్దపూడి జాతీయరహదారిపై మంగళవారం దారుణం చోటు చేసుకుంది.

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా టి. అన్నవరం మండలం గంటిపెద్దపూడి జాతీయరహదారిపై మంగళవారం దారుణం చోటు చేసుకుంది.  వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి... జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్థానిక టీడీపీ నేత రాము అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అతడి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే రాము మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement