కాలేజీపై దాడి చేసిన విద్యార్థులు | students attacked on college in proddatur | Sakshi
Sakshi News home page

కాలేజీపై దాడి చేసిన విద్యార్థులు

Mar 25 2016 10:57 AM | Updated on Sep 3 2017 8:34 PM

వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు దుర్సంపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలపై విద్యార్థులు శుక్రవారం దాడికి దిగారు.

ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు దుర్సంపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలపై విద్యార్థులు శుక్రవారం దాడికి దిగారు. హాస్టల్‌లో సరైన భోజనం పెట్టడం లేదని, బ్యాంకు కోచింగ్ అంటూ రూ.60వేల చొప్పున అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేమని కాలేజీ యాజమాన్యాన్ని అడిగితే వారు... తమను కొట్టారని ఆరోపించారు.

అనంతరం కళాశాలకు చెందిన వ్యానుతోపాటు కార్యాలయంలోని ఫర్నిచర్‌ను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని... విద్యార్థులతో ఆందళనను విరమింప చేసేందుకు యత్నిస్తున్నారు. అందులోభాగంగా వారితో పోలీసులు చర్చిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement