న్యూ గుంటూరు మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు | special trains | Sakshi
Sakshi News home page

న్యూ గుంటూరు మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు

Mar 4 2015 2:15 AM | Updated on Aug 24 2018 2:36 PM

వేసవిలో పెరగనున్న ప్రయాణికుల రద్దీ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రత్యేక రైళ్లను న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా నడపనున్నట్టు సీనియర్ డీసీఎమ్ జి.శ్రీరాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 సంగడిగుంట(గుంటూరు) : వేసవిలో పెరగనున్న ప్రయాణికుల రద్దీ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రత్యేక రైళ్లను న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా నడపనున్నట్టు సీనియర్ డీసీఎమ్ జి.శ్రీరాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 06335 నంబరుతో మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1వ తేదీలు బుధవారాల్లో 23.25 గంటలకు గౌహతి స్టేషన్‌లో బయలుదేరి శుక్రవారాలు మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3వ తేదీల్లో 20.55/57 గంటలకు న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా ప్రయాణించి శనివారాలు 7, 14, 21, 28, ఏప్రిల్ 4వ తేదీల్లో 22.30 గంటలకు కొచ్చివేలి చేరనుంది. అదే రైలు  తిరుగు ప్రయాణంలో 06336 నంబరుతో ఈ నెల 8, 15, 22, 29 తేదీల్లోని ఆదివారాలు 12.00 గంటలకు కొచ్చివేలిలో బయలుదేరి సోమవారాలు మార్చి 9, 16, 23, 30వ తేదీల్లో 13.05/07 గంటలకు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించి తరువాతి రోజులు మార్చి 11, 18, 25, ఏప్రిల్ 1వ తేదీల్లో బుధవారాలు ఉదయం 08.15 గంటలకు గౌహతి చేరనుంది.
 
  ఈ రైళ్లు మార్గమధ్యంలోని కొల్లం, కాయంకుళం, చెంగనూర్, తిరువల్లా, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, ఆలువా, త్రిశూర్, పాలక్కాడ్, పొదనూర్, తిరుపత్తూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కాడ్పాడి, ఆరక్కోణం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, న్యూగుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బర్హంపూర్, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భడ్రక్, బాలాశోర్ స్టేషన్ల మీదుగా ప్రయాణించి గౌహతి చేరనుంది.
 
 గుడారాల పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు
 గుంటూరు నగరంలోని గోరంట్లలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు హోసన్న మినిస్ట్రీస్ వారి గుడారాల పండుగ జరగనున్న సందర్భంగా పెరగనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4 వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అనకాపల్లి నుంచి గుంటూరు వరకు ప్రత్యేక ప్యాసింజరు రైళ్లను నడపనున్నట్లు సీనియర్ డీసీఎం జి.శ్రీరాములు మంగళవారం తెలిపారు.
 
 ఈ రైళ్లు అనకాపల్లిలో ఈ నెల 4వ తేదీ రాత్రి 19.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.45 గంటలకు గుంటూరు చేరనున్నాయి. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8వ తేదీ రాత్రి 22.00 గంటలకు గుంటూరులో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు అనకాపల్లి చేరనున్నాయి. ఈ రైళ్లు మార్గమధ్యంలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతూ ప్రయాణిస్తాయి.
 
 ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో జనరల్ బోగీలు
 గుడారాల  పండుగ సందర్భంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో రెండు జనరల్ బోగీలను ఏర్పాటు చేయనున్నారు. 17211/17212 మచిలీపట్నం-యశ్వంతపూర్-మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్, 12747/12748 గుంటూరు-వికారాబాదు-గుంటూరు, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు రెండు చొప్పున జనరల్ బోగీలను ఏర్పాటు చేయనున్నారు.
 
 హోలీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు
 హోలీ పండుగ సందర్భంగా పెరగనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శని, ఆదివారాల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్టు సీనియర్ డీసీఎమ్ జి.శ్రీరాములు మంగళవారం తెలిపారు. 07427 నంబరు రైలు హైదరాబాదులో ఈ నెల 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 18.45 గంటలకు బయలుదేరి 19.15/20 సికింద్రాబాద్, 21.32/33 నల్గొండ, 21.32/33 మిర్యాలగూడ, 22.03/04 నడికుడి, 22.32/33 పిడుగురాళ్ళ, 23.07/08 సత్తెనపల్లి, అర్ధరాత్రి 00.30/35 గంటలకు గుంటూరు మీదుగా ప్రయాణించి మరుసటి రోజు తెల్లవారుజామున 01.30/45 విజయవాడ, 02.30/32 ఏలూరు, 03.05/07 తాడేపల్లిగూడెం, 03.45/47 రాజమండ్రి, 04.40/42 సామర్లకోట స్టేషన్లలో ఆగుతూ 05.00 గంటలకు కాకినాడ టౌన్ స్టేషన్‌ను చేరనుంది.
 
 అదే రైలు తిరుగు ప్రయాణంలో 07428 నంబరుతో కాకినాడ టౌన్ స్టేషన్‌లో 21.05 గంటలకు 7వతేదీ శనివారం బయలుదేరి  అదే స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు తెల్లవారుజామున 03.00/20 గంటలకు గుంటూరు మీదుగా ప్రయాణించి ఉదయం 09.35 గంటలకు హైదరాబాదు చేరనుంది. ఈ రైల్లో అన్ రిజర్వుడు 2 స్లీపర్‌క్లాస్, 4 జనరల్, 1 సీటింగ్ బోగీలతో పాటు రిజర్వుడు 8 స్లీపర్‌క్లాస్, 1 టూ టైర్, 1 త్రీటైర్ ఏసీ బోగీలు ఉండనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement