'ఆ రెండు పార్టీల దొంగాట' | Raghuveera reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఆ రెండు పార్టీల దొంగాట'

Mar 20 2015 1:41 PM | Updated on Aug 29 2018 6:00 PM

'ఆ రెండు పార్టీల దొంగాట' - Sakshi

'ఆ రెండు పార్టీల దొంగాట'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి శుక్రవారం చిత్తూరులో నిప్పులు చెరిగారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి శుక్రవాంర చిత్తూరులో నిప్పులు చెరిగారు. ప్రత్యేక ఆంధ్రకు ఇవ్వాల్సిన ప్యాకేజీపై టీడీపీ, బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి మేలు చేస్తుంది.. అలాంటి ప్రాజెక్టును వదిలి పెట్టి...పట్టిసీమ అంటూ టీడీపీ ఎందుకు పాకులాడుతుందో అర్థం కావడం లేదని రఘువీరా అశ్చర్యం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది.  ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాన్నికి ఉన్న చిత్తశుద్ధి ఎంత వరకు ఉందో బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement