చెరువులు ఆక్రమిస్తే కఠినచర్యలు | prathipati pullarao visits chandragiri | Sakshi
Sakshi News home page

చెరువులు ఆక్రమిస్తే కఠినచర్యలు

Aug 6 2015 4:04 PM | Updated on Sep 3 2017 6:55 AM

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు చెరువును వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం పరిశీలించారు.

తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు చెరువును వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం పరిశీలించారు. ఈ చెరువు భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు రావడంతో గతంలో అధికారులు చెరువు వద్దకు వెళ్లగా వారిపై ఆక్రమణ దారులు దాడికి దిగారు. ఈ నేపధ్యంలో మంత్రి గురువారం చెరువును పరిశీలించి ఆక్రమణల దారులపై చర్యలు తీసుకుని చెరువుకు సంబంధించిన భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు కింద 400 ఎకరాల ఆయకట్టు ఉందని, తలకోన సప్లయ్ ఛానల్ నుంచి నీటిని చెరువుకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, నీటిపారుదల అధికారులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement