పేకాట స్థావరంపై పోలీసుల దాడి | police raid on gambling club | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

May 9 2015 5:58 PM | Updated on Sep 17 2018 6:26 PM

పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 18మందిని అదుపులోకి తీసుకున్నారు.

నర్సరావుపేట (గుంటూరు జిల్లా):  పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 18మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని లలితానగర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. లలితానగర్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో గుంటూరు ప్రత్యేక పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడిలో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో టీడీపీ నేతలున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement