విసిగి...వేసారిన జనం | People Sufferd In CM Navanirmana Deeksha at Chittoor | Sakshi
Sakshi News home page

విసిగి...వేసారిన జనం

Jun 8 2018 8:44 AM | Updated on Oct 20 2018 4:47 PM

People Sufferd In CM Navanirmana Deeksha at Chittoor - Sakshi

చండ్రమాకులపలె వద్ద మండుటెండలో నిరీక్షిస్తున్న జనం

పుంగనూరు : చండ్రమాకులపల్లెకు సీఎం చంద్రబాబు గంటకుపైగా ఆలస్యంగా రావడంతో టీడీపీ నాయకులు విసిగిపోయారు. సీఎం సభ కోసం తరలించిన జనం మండుటెండలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలకంటే అధికారులు, పోలీసులే ఎక్కువగా కనిపించారు. ఐదు నిముషాల్లో సభ ముగించడంతో జనం నిరాశచెందారు. అంతేకాకుండా పలు ఆర్టీసీ బస్సులు సీఎం సభకు ప్రజలను తరలించేం దుకు మరలించడంతో ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు.

Advertisement
 
Advertisement
Advertisement