వైఎస్ఆర్ జిల్లా రామాపురం మండలం బండపల్లె సమీపంలో గురువారం బైక్ - లారీ ఢీకొన్నాయి.
కడప : వైఎస్ఆర్ జిల్లా రామాపురం మండలం బండపల్లె సమీపంలో గురువారం బైక్ - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దుర్ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.