జగదాంబ జంక్షన్లో ఓ దారుణం జరిగింది. Old woman murder in
విశాఖపట్నం: జగదాంబ జంక్షన్లో ఓ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొందరు దుండగులు ఇల్లు అద్దెకు కావాలని జగదాంబ జంక్షన్లో ఒక ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆ ఇంట్లో హఫీజ్ మున్నీసా బేగం అనే వృద్ధ మహిళ ఉన్నారు.
దుండగులు చేతి రుమాలును ఆ వృద్ధురాలి పీకకు చుట్టి బిగించి హత్య చేశారు. ఆ తరువాత వారు పారిపోవడానికి ప్రయత్నించారు. దుండగులలో ఒకరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.