
దయచేసి పార్టీలోకి తిరిగి రండి: రఘువీరా
సీమాంధ్రలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఆ ప్రాంత పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఆ ప్రాంత పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి వెల్లడించారు. 21 నుంచి 27 వరకు బస్సుయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. 21న ఉదయం శ్రీకాకుళంలో, మధ్యాహ్నం విజయనగరంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 27న అనంతపురం కర్నూలు జిల్లాల్లో బస్సుయాత్ర ఉంటుందన్నారు.
తమ పార్టీలో జెండా మోసే కార్యకర్తలకు లోటు లేదన్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి గల కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పోటీకకి నేతలు లేనిచోట కొత్త నాయకత్వానికి అవకాశమిస్తామన్నారు. కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కల్పించాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లినవారు దయచేసి తిరిగి రావాలని రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు చిరంజీవి, ఆనం రామనారాయణ రెడ్డి తదితర నేతలతో రఘువీరా భేటీ అయ్యారు.