విశాఖలో ఏడు కంటైన్‌మెంట్‌ జోన్లు..

Minister Kannababu Said Seven Containment Zones Have Been Identified In Visakhapatnam - Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, విశాఖపట్నం: కరోనా మొదటి కేసు నమోదయినప్పటి నుంచి నియంత్రణ చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. విశాఖలో ఏడు కంటైన్‌మెంట్‌ జోన్లు గుర్తించామన్నారు. 2.6 లక్షల మంది ఈ జోన్‌ల్లో ఉన్నారన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామ వాలంటీర్లను ఆదేశించామని తెలిపారు. స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో 148 క్రిటికల్‌ , 500 నాన్‌ క్రిటికల్‌ పడకలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. గీతం, అపోలో తదితర ఐదు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 2,188 పడకలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top