బోర్ లారీ యాక్సైల్ పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

బోర్ లారీ యాక్సైల్ పడి వ్యక్తి మృతి

Published Wed, Feb 25 2015 7:23 PM

man died in bore lorry accident

పలమనేరు (చిత్తూరు): బోర్‌లారీ యాక్సైల్ రోడ్డుపై ప్రయాణిస్తున్న పాదచారులపై పడటంతో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈసంఘటన బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన పరమేష్(21), సంజీవ్(22) పలమనేరులోని ఇండస్ట్రియల్ పవర్‌లూమ్‌లో పనిచేస్తున్నారు. కాగా, బుధవారం చెన్నై-బెంగళూరు జాతీయరహదారిపై నడుస్తుండగా బోర్‌లారీ యాక్సైల్ పడింది. ఈ ప్రమాదంలో పరమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement