రైలు పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యం | Lovers commit suicide at railway track in mahabubabad | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యం

Dec 26 2013 8:47 AM | Updated on Oct 8 2018 5:19 PM

వరంగల్‌ జిల్లా మహబూబాబాద్ రైల్వేట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం కావటం స్థానికంగా కలకలం రేపింది.

వరంగల్‌ జిల్లా మహబూబాబాద్ రైల్వేట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం కావటం   స్థానికంగా కలకలం రేపింది. ఇందులో ఒకరు రజిత అనే యువతి కాగా..మరొకరు ఇదే ప్రాంతానికి చెందిన ఇఫ్రాన్‌గా పోలీసులు గుర్తించారు. మరిపెడకు చెందిన రజితకు ఇటీవలే పెళ్లిచూపులు జరిగాయి. బంధువుల ఇంటికని వచ్చిన రజిత రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించింది. అటు మెకానిక్‌గా పని చేస్తున్న ఇఫ్రాన్‌ కూడా ఇదే ట్రాక్‌పై శవమై కనిపించాడు. వీరు చనిపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement