కౌలు రైతు ఆత్మహత్య | Lease farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Dec 3 2015 12:04 PM | Updated on Oct 1 2018 2:47 PM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన కౌలురైతు రాంబాబు(33) అప్పుల బాధతో గురువారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన కౌలురైతు రాంబాబు(33) అప్పుల బాధతో గురువారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అర ఎకరా పొలం ఉన్న రాంబాబు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాడు. వరుస నష్టాలతో అప్పుల పాలయ్యాడు.

పంట సాగుకు చేసిన రూ.5లక్షల అప్పు తీర్చే విధానం తెలియక ఆవేదనకు గురై గురువారం ఉదయం తన పొలంలో పురుగుల మందు సేవించి కుప్పకూలిపోయాడు. గమనించిన రైతులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement