ఆ బాధ ఇప్పటికీ ఎంతో ఉంది: కేవీపీ | KVP Ramachandra Rao Remembers YSR on his birth anniversary | Sakshi
Sakshi News home page

ఆత్మీయుడిని కోల్పోయిన బాధ ఇప్పటికీ: కేవీపీ

Jul 8 2019 1:55 PM | Updated on Jul 8 2019 1:58 PM

KVP Ramachandra Rao Remembers YSR on his birth anniversary - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ చరిత్రలోనే అరుదైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని ఆయన స్నేహితుడు, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. నేడు వైఎస్సార్‌ 70వ జయంతి సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ... ‘ఒక ఆత్మీయుడ్ని కోల్పోయిన బాధ నాకు ఇప్పటికీ ఎంతో ఉంది. వైఎస్సార్‌ సంక్షేమ పథకాలు వందల ఏళ్లు ఆదర్శంగా నిలుస్తాయి. ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ అభివృద్ధిలోనూ వైఎస్సార్‌ది చెరగని ముద్ర. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు, ఫ్లైఓవర్లు, కృష‍్ణా జలాల తరలింపు అంతా ఆయన దార్శనికత వల్లే సాధ్యమైంది’ అని గుర్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement