తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం చేపట్టిన ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బుధవారం లేఖలు రాశారు. రాష్ట్ర విభజనతో నష్టపోతామని వారంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమంతో ఒకటిన్నర మాసాలుగా ప్రభుత్వం, పాలనా యంత్రాంగం పూర్తిగా స్థంభించిపోయాయని వివరించారు.
ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను లేఖలో ప్రస్థావించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి ఆంటోనీ, హోం మంత్రి సుశీల్కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్లకు మంత్రి విడివిడిగా లేఖలు రాశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఎన్జీవో సంఘం నేతలు ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలూ చేయలేదని, హుందాగా వ్యవహరించారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగమైన ఎన్జీవోల సభ విజయవంతం కావడం మొత్తం ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు, విభజనపై వారిలో వ్యక్తమవుతున్న భయాందోళనలకు అద్దం పట్టిందని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అధిష్టానానికి కిశోర్చంద్రదేవ్ లేఖలు
Published Thu, Sep 12 2013 2:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement