ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు కేజీహెచ్ వైద్య జేఏసీ శనివారం తన సంఘీభావాన్ని ప్రకటించింది.
ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు కేజీహెచ్ వైద్య జేఏసీ శనివారం తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి వైద్యులంతా ఈ రోజు సామూహిక సెలవు పెడుతున్నట్లు వెల్లడించింది. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి విభాగాలు నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు కేజీహెచ్ వైద్య జేఏసీ వివరించింది.