లీమా–2019లో ‘ఐఎన్‌ఎస్‌ కద్మత్‌’ | Indian Warship Reached Malaysia For Exhibition | Sakshi
Sakshi News home page

లీమా–2019లో ‘ఐఎన్‌ఎస్‌ కద్మత్‌’

Mar 26 2019 12:16 PM | Updated on Mar 29 2019 1:23 PM

Indian Warship Reached Malaysia For Exhibition - Sakshi

లంకావీ సముద్ర జలాల్లో ఐఎన్‌ఎస్‌ కద్మత్‌

విశాఖసిటీ: లంకావీ ఇంటర్నేషనల్‌ మారీటైమ్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఎగ్జిబిషన్‌–2019లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ మలేషియా చేరుకుంది. లంకావీ పోర్టుకు సోమవారం చేరుకున్న కద్మత్‌కు ఆ దేశ నౌకాదళం ఘన స్వాగతం పలికింది. వరుసగా 15వ సంవత్సరం లీమా ప్రదర్శనను మలేషియా నౌకాదళం నిర్వహిస్తోంది. ఏడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ప్రదర్శనలో భాగంగా ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ కూడా నిర్వహిస్తున్నట్లు ఆ దేశ నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. 29 నౌకాదళాలకు చెందిన నౌకలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో పాటు నౌకాదళ విన్యాసాలు, యుద్ధ విమానాల ప్రదర్శనలు, ఆయా దేశాలకు చెందిన యుద్ధ నౌకల సందర్శన, నౌకాదళ కార్యకలాపాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement