'ఒకరు వెళిపోతే పదిమంది వస్తారు' | if one quit, many ready to join party, says jairam ramesh | Sakshi
Sakshi News home page

'ఒకరు వెళిపోతే పదిమంది వస్తారు'

Mar 11 2014 11:06 AM | Updated on Mar 18 2019 9:02 PM

'ఒకరు వెళిపోతే పదిమంది వస్తారు' - Sakshi

'ఒకరు వెళిపోతే పదిమంది వస్తారు'

కాంగ్రెస్ పార్టీని ఒక్కరు విడిచి వెళితే పదిమంది యువకులు పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

పోలవరం : కాంగ్రెస్ పార్టీని ఒక్కరు విడిచి వెళితే పదిమంది యువకులు పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం పోలవరం స్పిల్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ పోలవరం జాతీయ హోదాకు కావూరి సాంబశివరావు, పల్లంరాజులు గట్టిగా కృషి చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నా అక్కడ నిర్వాసితులకు రూ.600 కోట్లు ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుందని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement