యూనివర్సిటీక్యాంపస్, న్యూస్లైన్: ఎస్వీయూలో అందరి చూపూ అధ్యాపక పోస్టులపైనే ఉంది. ఎస్వీయూలో 268 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఇందులో 110 అసిస్టెంట్ ప్రొఫెసర్, 95 అసోసియేట్ ప్రొఫెసర్, 63 ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అధికారులు రోస్టర్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి, జనవరి నెలాఖరుకు పోస్టులు భర్తీ చేయాలన్న దిశగా పనిచేస్తున్నారు.
ఆశల పల్లకిలో అభ్యర్థులు
ఎస్వీయూలో 2007 తర్వాత అధ్యాపక పోస్టుల ను భర్తీ చేయలేదు. 625 అధ్యాపకుల పోస్టుల్లో 300 ఖాళీగా ఉన్నాయి. 2015 చివరికల్లా మరో 200 మంది రిటైర్డ్ కానున్నారు. 125 మంది అధ్యాపకులు మాత్రమే మిగులుతున్నారు. ఈ నేపథ్యంలో 268 పోస్టుల భర్తీకి అనుమతి రావడంతో నిరుద్యోగులు వాటిపై ఆశలు పెంచుకున్నారు. ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
కేసుల అడ్డంకి తొలగేనా?
ఎస్వీయూలో 2007లో జరిగిన అధ్యాపక పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ పలువురు కోర్టుకెళ్లారు. ఇందులో రెండు కేసులు బలంగా ఉన్నాయి. ఒకటి రోస్టర్కు సంబంధిం చింది కాగా, మరొకటి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు బోధనానుభవం లేని వారికి కట్టబెట్టారని ఆరోపిస్తూ వేసిన కేసు. ఈ కేసులు వేసిన వారిని రాజీ చేయించి ఎత్తి వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కేసులు వేసిన వారు కూడా నిర్ధిష్ట హామీ లభిస్తే వెనక్కి తీసుకొనే ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే నోటిఫికేషన్కు అడ్డంకి తొలగినట్లే.
మొదలైన బేరసారాలు
ఎస్వీయూ వీసీగా రాజేంద్ర, రిజిస్ట్రార్గా సత్యవేలురెడ్డి విధుల్లో చేరిన రోజు నుంచే అధ్యాపక పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. వీరికి జిల్లాకు చెందిన ముఖ్యనేత అండదండలు ఉండడంతో ప్రయత్నాలు ఫలించాయి. 268 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో ఆశావహులు రంగంలోకి దూకారు. ఇదే సమయంలో మధ్యవర్తులు తెరపైకి వచ్చారు. ఆశావహులను గుర్తించి అందిన కాడికి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు రూ.20 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు రూ.25 లక్షలు పలుకుతోందని సమాచారం. ఇందులో సగం డబ్బులిస్తే అభ్యర్థి కోరుకున్న విభాగంలో, కోరుకున్న కేటగిరిలో పోస్టు వచ్చేలా చేస్తామని మధ్యవర్తులు హామీలు గుప్పిస్తున్నారు. కొంద రు అభ్యర్థులు ఉన్నతాధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. పలుకుబడిని ఉపయోగించి ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని చూస్తున్నా రు. అయితే ఇప్పటికే దాదాపు అన్ని పోస్టులకు అభ్యర్థులు ఖరారయ్యారని, నోటిఫికేషన్ రావడమే ఆలస్యమనే ప్రచారం సాగుతోంది.
అందరి చూపూ ఆ పోస్టులపైనే
Published Tue, Nov 5 2013 4:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement