పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులు | governor narasimhan couple take holy godavari Pushkara bath in rajahmundry | Sakshi
Sakshi News home page

పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులు

Jul 20 2015 10:54 AM | Updated on Aug 1 2018 5:04 PM

గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం రాజమండ్రిలోని సరస్వతి పుష్కర ఘాట్ లో పుణ్యస్నానం చేశారు.

రాజమండ్రి : గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం రాజమండ్రిలోని సరస్వతి పుష్కర ఘాట్ లో పుణ్యస్నానం చేశారు.  సోమవారం ఉదయం  గవర్నర్‌ దంపతులు హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. అధికారులు ఈ సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికారు.   సరస్వతీ ఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు. అర్చకులు గోదావరి పుష్కర ప్రాశస్త్యాన్ని గవర్నర్‌ దంపతులకు వివరించారు. గవర్నర్‌ రాక సందర్భంగా రాజమండ్రిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. రాజమండ్రి నుంచి గవర్నర్‌ భద్రాచలం బయలుదేరి వెళతారు. అక్కడ పవిత్ర స్నానం చేసి సీతారామస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement