స్వర్ణరథం బంగారు తాపడం పనులు ప్రారంభం | gold micro plating works begin on golden chariot of Lord Venkateswara | Sakshi
Sakshi News home page

స్వర్ణరథం బంగారు తాపడం పనులు ప్రారంభం

Aug 26 2013 9:46 AM | Updated on Sep 1 2017 10:08 PM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి స్వర్ణరథానికి బంగారు తాపడం పనులు సోమవారం ప్రారంభం అయ్యాయి.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి స్వర్ణరథానికి బంగారు తాపడం పనులు సోమవారం ప్రారంభం అయ్యాయి. తిరుపతి టీటీడీ పరిపాలన విభాగంలోని జ్యూయలరీ విభాగం ఆధ్వర్యంలో బంగారు తాపడం పనులు చేస్తున్నట్లు టీటీడీ ఈవో గోపాల్ తెలిపారు. సెప్టెంబర్ 25లోగా పనులు పూర్తవుతాయని, స్వర్ణరథం ఎత్తు 30 అడుగులుగా పేర్కొన్నారు. ఈ తాపడానికి 73 కిలోల బంగారం, మూడు టన్నుల రాగి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. బంగారు తాపడానికి రూ.35 కోట్లు ఖర్చు అవుతుందని ఈవో వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement