పొలంలో బోరు మోటారు ఆన్ చేయటానికి వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో చనిపోయాడు.
పొలంలో బోరు మోటారు ఆన్ చేయటానికి వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో చనిపోయాడు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండారుపల్లి హనుమయ్య(40) బుధవారం మధ్యాహ్నం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మాచర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు విడిచాడు.