రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా మార్చే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా మార్చే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఈ- గవర్నెన్స్ అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
తొలి విడతగా పది ప్రభుత్వ శాఖల్లో కాగిత రహిత పాలన కొనసాగుతుందని, మొత్తం ఆన్లైన్ ద్వారానే కార్యకలాపాలు సాగుతాయని చెప్పారు. రుణ మాఫీకి చంద్రబా బు కట్టుబడి ఉన్నారని, తొలి విడత రుణ మాఫీపై ప్రకటన చేసినా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో ధర్నాకు దిగడం సరికాదన్నారు.