శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ దినేశ్ రెడ్డి | DGP Dinesh Reddy Offers Prayers at Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ దినేశ్ రెడ్డి

Sep 29 2013 9:06 AM | Updated on Sep 1 2017 11:10 PM

తిరుమల శ్రీవారిని డీజీపీ దినేశ్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని డీజీపీ దినేశ్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయకు స్వాగతం పలికారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు డీజీపీకి అందజేశారు.

 

అయితే ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement