ఏపీలో మరో రెండు కరోనా కేసులు

CoronaVirus: Another Two Positive Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో వాషింగ్టన్‌ నుంచి వచ్చిన యువకుడికి.. అదేవిధంగా గుంటూరులో 52 ఏళ్ల వ్యక్తికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలిందన్నారు. దీంతో ఏపీలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య పదికి చేరుకుందన్నారు. బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఈ విషయాలను జవహర్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో మతపరమైన సమావేశానికి వెళ్లి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన గుంటురూ వ్యక్తికి కరోనా సోకినట్లు వివరించారు. ఈ రోజు 60 మంది కరోనా అనుమానితుల శాంపిళ్లను పరీక్షలకు పంపామని, అందులో రెండు పాజిటివ్‌ అని తేలిందని జవహర్‌రెడ్డి తెలిపారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top