సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇందిరమ్మ పథకంలో భాగంగా గత ప్రభుత్వం మంజూరు చేసిన 30వేల ఇళ్లు ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటికి రూ. 4.5కోట్లు వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటి నిర్మాణం పూర్తవ్వాలంటే చెల్లింపుల మొత్తం ఇంకా పెరగాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న ఇళ్ల బిల్లు చెల్లింపులను నిలిపివేసింది. జియో ట్యాగింగ్ అంటూ జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో లబ్ధిదారులు చాలా మంది అక్కడా ఇక్కడా అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేయగా, మరికొంతమంది మొండిగోడలతో వదిలేశారు. లబ్ధిదారుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో ఇప్పుడా పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించింది.
నిలిచిపోయిన బ్యాంకు ఖాతాలు
రెండేళ్లుగా లావాదేవీలు జరగకపోవడంతో ఇళ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు నిలిచిపోయాయి. వాటిని ఇప్పుడు వినియోగించినా సాంకేతికంగా పనిచేయవు. వాటిని పునరుద్ధరించుకుంటేనే బిల్లులు చెల్లిస్తామంటూ ఆంక్షలు విధించింది. అంతేగాదు ప్రస్తుతం అమలు చేస్తున్న 6పాయింట్ల ప్రాతిపదికను పరిశీలిస్తామని చెబుతోంది. అదే ఇప్పుడు వారికి ఇబ్బందికరంగా మారాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై దాదాపు ఐదారేళ్లు అవుతోంది. ఆ తర్వాత లబ్ధిదారుల స్థితిగతులు మారుతాయి. ఈ క్రమంలో తాజాగా 6పాయింట్ల ప్రాతిపదికను అవలంబిస్తే కొందరు లబ్ధిదారులు అనర్హులవుతారు.
6 పాయింట్లు ఏంటంటే..,
నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, ఐదెకరాలు పల్లపు భూములు లేదా 10ఎకరాల మెట్టు భూములు ఉన్న వారు, భార్యభర్తల్లో ఉద్యోగం ఉన్నవారు, రూ.500కన్నా ఎక్కువ విద్యుత్ బిల్లు వచ్చిన వారు, భార్యభర్తల్లో ఎవరో ఒకరి పేరు మీద ఇంటి పన్ను ఉన్నవారు, వరుసగా నాలుగు నెలలు రేషన్ సరుకులు తీసుకోని వారు అనర్హులవుతారని ప్రభుత్వం తాజా ఉత్తర్వులు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యంగా కారు, రూ.500విద్యుత్ బిల్లు, భార్యభర్తల్లో ఉద్యోగం ఉన్నవారు అనేవి ఇబ్బందికరంగా మారాయి.
ఐదేళ్ల క్రితం ఇళ్లు మంజూరైన లబ్ధిదారుని పరిస్థితులు క్రమేపీ మారడానికి అవకాశం ఉంది. ఆ క్రమంలో విద్యుత్ బిల్లు పెరగొచ్చు. కారు కొనుక్కోవచ్చు. భార్యభర్తల్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం రావొచ్చు. అంతమాత్రాన గతంలో పొందిన లబ్ధికి తాజా అంశాలను ముడిపెట్టడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఏదో ఒక కొర్రీ పెట్టి గత లబ్ధిదారులను వదిలించుకోవడమే ప్రభుత్వం ఆలోచనగా కనబడుతోందనే వాదనలు విన్పిస్తున్నాయి.
షరతులు వర్తిస్తాయి !
Published Wed, Apr 20 2016 1:42 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పెట్టుబడుల పేరుతో లక్షల వంచన
పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు
పాడి రైతులు లబ్ధి పొందాలి
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కామేశ్వర రావు ప్రమాణం
గురుకులాల్లోనే ఉపాధ్యాయులు బస చేయాలి
భక్తిశ్రద్ధలతో హనుమ జయంతి
బావిలో పూడిక తీస్తూ నీట మునిగి మృతి
నన్ను గెలిపిస్తే సమస్యలపై స్పందిస్తా
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
తప్పక చదవండి
- రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
- 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
- రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
- శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
Advertisement