ఫుడ్ పాయిజన్తో చిన్నారుల అస్వస్థత

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలో సోమవారం ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు అస్వస్థతకు గురయ్యారు. మిగిలిపోయిన మిఠాయిలు తినటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్ధతకు గురైనవారిని స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు విజయవాడకు తరలించారు.
పెళ్లిళ్లలో వంట పనులు చేసే మహిళలు.. వడ్డించిన స్వీట్ కోవా మిగలడంతో ఇంటికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్లిన కోవాను వారి పిల్లలు, వారు తినటంతో అస్వస్ధతకు గురయ్యారు. అస్వస్ధకు గురైనవారు ప్రస్తుతం చికిత్స విజయవాడ పాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి