మేడిపండులా చంద్రబాబు పాలన | Chandrababu Naidu regime medipandula | Sakshi
Sakshi News home page

మేడిపండులా చంద్రబాబు పాలన

Sep 10 2014 11:59 PM | Updated on Oct 30 2018 6:08 PM

మేడిపండులా చంద్రబాబు పాలన - Sakshi

మేడిపండులా చంద్రబాబు పాలన

వెంకటాచలం: చంద్రబాబు పాలన మేడిపండు చందాన సాగుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఇస్కపల్లిలో మంగళవారం ఆయన విజయయాత్ర నిర్వహించారు.

వెంకటాచలం: చంద్రబాబు పాలన మేడిపండు చందాన సాగుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఇస్కపల్లిలో మంగళవారం ఆయన విజయయాత్ర నిర్వహించారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు స్పష్టత లేని వాగ్దానాలు, మాటలతో ప్రజలను మోసం చేస్తూ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణమాఫీ అమలులో స్పష్టత కరువైందన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేసి ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లు,రేషన్‌కార్డులు తొలగించేందుకు సీఎం యత్నిస్తున్నారన్నారు.  చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన వారికి ఇప్పుడు మొండి చేయి చూపుతున్నారన్నారు. హంగులు, ఆర్భాటాలు తప్ప మూడు నెలలుగా ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ఎమ్మెల్యేల నిధుల్లో కోత విధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. జెడ్పీ, మండల పరిషత్, ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నిస్తానన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయయాత్ర చేపట్టానన్నారు.  అందరికీ అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరికి తోబుట్టువులా, ప్రతి ఇంట్లో సభ్యుడిగా సమస్యల పరిష్కారానికి ముందుంటానని భరోసా ఇ చ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీటీసీ సభ్యురాలు నరాల జయమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్  కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెళ్లూరు సుధాకర్‌రెడ్డి, కనుపూరు కోదండరామిరెడ్డి, అడపాల ఏడుకొండలు, రావూరు కోదండరామానాయుడు, కోడూరు కమలాకర్‌రెడ్డి, బుడంగుంట రామకృష్ణా, కోడూరు రఘునందన్‌రెడ్డి, ఉప్ప భూపయ్య, డేగా శ్రీనివాసులు, నలగర్ల నరసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement