'ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి ఇంటర్పోల్ సాయం' | BJP MLA G. Kishan Reddy offers prayers at Tirumala temple | Sakshi
Sakshi News home page

'ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి ఇంటర్పోల్ సాయం'

Jul 27 2014 9:40 AM | Updated on Mar 28 2019 8:41 PM

'ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి ఇంటర్పోల్ సాయం' - Sakshi

'ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి ఇంటర్పోల్ సాయం'

ఎర్రచందనం అక్రమ రవాణను అరికట్టేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి తెలిపారు.

తిరుమల : ఎర్రచందనం అక్రమ రవాణను అరికట్టేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలలో వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... వకుళామాత ఆలయం నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపినా... అధికారుల నిర్లక్ష్యంతోనే ఆ ఆలయ పనులు ఇప్పటికీ ప్రారంభకాలేదని ఆరోపించారు. దేవాలయ ప్రాంతాల్లో అన్యమత ప్రచారం సరికాదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement