'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది' | AP Bhavan has become Andhra Bhavan: Devi prasad | Sakshi
Sakshi News home page

'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది'

Oct 10 2013 11:46 AM | Updated on Mar 28 2019 5:23 PM

'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది' - Sakshi

'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్ష ప్రజలను అవమానపరచటమేనని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.

కరీంనగర్:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న దీక్ష ప్రజలను అవమానపరచటమేనని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారిందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షవాతం వచ్చిందని దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓఎం కమిటీ అస్పష్టంగా ఉందని.... నివేదికకు నిర్ణీత గడువు విధించాలని దేవీ ప్రసాద్ అన్నారు. దినేష్ రెడ్డి వ్యాఖ్యలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. 1౦వ వేతన సవరణ కోసం ఉద్యమం చేయనున్నట్లు దేవీప్రసాద్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement