'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది' | Sakshi
Sakshi News home page

'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది'

Published Thu, Oct 10 2013 11:46 AM

'ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారింది' - Sakshi

కరీంనగర్:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న దీక్ష ప్రజలను అవమానపరచటమేనని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఏపీభవన్....ఆంధ్రాభవన్గా మారిందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షవాతం వచ్చిందని దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓఎం కమిటీ అస్పష్టంగా ఉందని.... నివేదికకు నిర్ణీత గడువు విధించాలని దేవీ ప్రసాద్ అన్నారు. దినేష్ రెడ్డి వ్యాఖ్యలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. 1౦వ వేతన సవరణ కోసం ఉద్యమం చేయనున్నట్లు దేవీప్రసాద్ తెలిపారు.

Advertisement
Advertisement