తిరుమల ఏడు కొండల వాడిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల ఏడు కొండల వాడిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రాతఃకాల సమయంలో స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి శ్రీ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.